వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరవరరావుమాటలు పిచ్చి ప్రేలాపనలు: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నాగార్జున సాగర్‌ ఆయకట్టు కిందిరైతులకు నీళ్లు ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు నీరు ఇస్తే సహించబోమనితెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)శాసనసభ్యులు హెచ్చరించారు.నాగార్జునసాగర్‌ కుడి, ఎడమకాలువల కింది ఆయకట్లకు నీళ్లుఇవ్వకుండా కృష్ణా డెల్టాకు నీరుఇవ్వకూడదని వారు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డినికోరారు.

ఈమేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రంసమర్పించినట్లు టి ఆర్‌యస్‌శాసనసభ్యులు మందడిసత్యనారాయణ రెడ్డి, జి. నగేష్‌తదితరులు గురువారంవిలేకరులతో చెప్పారు. కృష్ణాడెల్టాకు నీరు ఇవ్వడానికి తామువ్యతిరేకం కాదని, అయితేతెలంగాణకు అన్యాయం చేయకూడదనివారన్నారు. నాగార్జునసాగర్‌కుడి, ఎడమ కాలువల కింది రైతులప్రయోజనాలను ఫణంగా పెట్టి కృష్ణాడెల్టాకు నీరివ్వడం సరి కాదనివారన్నారు.ఇదిలావుంటే, కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలనిడిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లామంగళగిరిలో బంద్‌ జరిగింది. అఖిల పక్షంనేతృత్వంలో ఈ బంద్‌ జరిగింది. బంద్‌వల్ల ఆర్టీసి బస్సులు నడవలేదు.దుకాణాలు మూసేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X