కళంకితమంత్రులను వెంటనే తొలగించాలి: టిడిపి
ఆదివారంనాడిక్కడ ఎన్టీ ఆర్ ట్రస్ట్ భవన్లో జరిగినవిలేకరుల సమావేశంలో టిడిపి ప్రధానకార్యద ర్శి రేవూరి ప్రకాష్రెడ్డి యూపీఏ ప్రభుత్వ పై విమర్శలు గుప్పించారు.విమర్శించారు. ప్రధాని తన ఆత్మసాక్షిగావ్యవహరిస్తూ కళంకిత మంత్రులనువెంటనే పదవుల నుంచి తొలగించాలని ప్రకాష్రెడ్డిడిమాండ్ చేశారు.కాంగ్రెస్గత చరిత్ర చూసినా ఆ పార్టీ అవినీతిపరులు,ఫ్యాక్షనిస్టులకే అగ్రతాంబూలం ఇచ్చిందని విమర్శించారు.చంద్రబాబునాయుడు అక్రమంగా కోట్లాదిరూపాయలు సంపాదించారంటూ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ప్రకాష్రెడ్డితీవ్రంగా ఖండించారు. ఏదో ఒక ప్రచారం చేసిరాజకీయ లబ్ధి పొందాలని చూడటం కాంగ్రెస్ఎమ్మెల్యేలు మానుకోవాలని ఆయనహితవు పలికారు. చంద్రబాబుపై గాలివిమర్శలు చేసే ఎమ్మెల్యేలు ఆయన అక్రమంగాసంపాదించడాని చెపుతోన్న ఆస్తుల వివరాలనుకూడా వెల్లడించవచ్చు కదా అని ఆయన ఎదురుప్రశ్నించారు.