వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్నిపార్టీలతోనే చర్చలపై బిజెపిఅభ్యంతరం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలోని భూమి సమస్యపైముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి కొన్ని పార్టీల అభిప్రాయాలనేతీసుకోవడం పట్ల భారతీయ జనతా పార్టీ(బిజెపి) రాష్ట్ర సీనియర్‌నాయకుడు, మాజీ కేంద్ర మంత్రిచెన్నమనేని విద్యాసాగరరావుతప్పు పట్టారు. భూసమస్యపరిష్కారానికి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సిపి ఐ, సిపియం నాయకులతోసోమవారం చర్చించారు.

భేదాభిప్రాయాలున్నాయనేపేరుతో కొన్ని పార్టీలను చర్చలకుఆహ్వానించకుండా ఆ పార్టీలుభూసంస్కరణలకు వ్యతిరేకమనేసంకేతాన్ని ముఖ్యమంత్రి ఇవ్వడంతీవ్రమైన విషయమనివిద్యాసాగరరావు మంగళవారంమీడియా ప్రతినిధులతో అన్నారు.భూపంపణీపై ప్రభుత్వానికిచిత్తశుద్ధి వుంటే 1993డిసెంబర్‌ 31వరకు సాగు చేసుకుంటున్నభూములను గిరిజనులకు ఇవ్వాలని ఆయనప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.నక్సలైట్‌సమస్యకు శాశ్వత పరిష్కారంకనుక్కునే చిత్తశుద్ధి కాంగ్రెస్‌ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.ప్రభుత్వ వైఖరి వల్ల పెట్టుబడిదారుల్లో,ప్రజల్లో అభద్రతా భావంపెరుగుతోందని ఆయన అన్నారు. కొత్తపరిశ్రమలు రాకపోగా వున్నపరిశ్రమలు తరలిపోయే ప్రమాదంఏర్పడిందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X