ఎక్కువైనకృష్ణా జలాలు సముద్రం పాలు
ఖమ్మం,వరంగల్ జిల్లాల్లో కురుస్తున్నవర్షాల వల్ల కృష్ణా నదిలోకి పెద్దయెత్తున నీరు వచ్చి చేరుతోంది.కృష్ణా డెల్టా కాలువలకు నీరువదిలారు. కృష్ణా బ్యారేజీలోకి ముప్పైయేడు వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నట్లు అధికారులుచెబుతున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి,నారాయణపూర్ రిజర్వాయర్లునిండిపోవడంతో ఆంధ్రప్రదేశ్కునీరు వదిలారు. ఇదిలా వుంటే, గోదావరినీటి మట్టం కూడా పెరుగుతోంది.ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం ఉధృతంగా పెరుగుతోంది.అయితే ఇది ప్రమాద స్థాయికిచేరుకోకపోవచ్చుననిఅంటున్నారు.పశ్చిమ,మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడనం బుధవారం రాత్రికి తీరందాటే అవకాశాలున్నాయి. ఒరిస్సా, ఉత్తరకోస్తాంధ్ర తీరం వద్దబంగాళాఖాతంలో కేంద్రీకృతమైనఅల్పపీడనం బలహీనపడుతోంది. దీనివల్ల వచ్చే ఇరవై నాలుగు గంటల్లోఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉంది. ఇతర కోస్తా జిల్లాల్లోఉరములతో కూడిన జల్లులుకురవవచ్చు.