వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాపుష్కరాల సమావేశం రసాభాస

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపైసమీక్షించడానికి శుక్రవారంఏర్పాటయిన సమావేశం పరస్పరఆరోపణలతో రసాభాసగా మారింది.దేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావు ఎదుటేతెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులుపరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలుచేసుకున్నారు.

కృష్ణాపుష్కరాల ఏర్పాట్ల కోసం రెండు వందలపది కోట్ల రూపాయలు విడుదల చేశామనిప్రభుత్వం చెబుతోందని అంటూ ఇందులో ఏ శాఖకింద ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలనితెలుగుదేశం శాసనసభ్యుడు ఉమామహేశ్వరరావు, విజయవాడమేయర్‌ అనురాధ డిమాండ్‌చేశారు. వీరి విమర్శలను తిప్పికొట్టడానికికాంగ్రెస్‌ శాసనసభ్యుడు దేవినేనినెహ్రూ తదితరులుప్రయత్నించారు.గోదావరిపుష్కరాలకు ధీటుగా కృష్ణా పుష్కరాలునిర్వహిస్తామని, యాత్రికులకుఅసౌకర్యం కలగకుండా ఏర్పాట్లుచేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు చెప్పారు. కొన్నిలోటుపాట్లు ఉన్న మాట వాస్తవమేనని,అయితే ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తోందనేది నిజం కాదని ఆయనఅన్నారు. ఆగస్టు పదిహేనవ తేదీ నాటికిఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయనఅధికారులను ఆదేశించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X