నరేంద్రఉద్వాసనకు సిపిఐ డిమాండ్
నల్లగొండ:కర్నూలు లోక్సభ సభ్యుడు కోట్లసూర్యప్రకాష్ రెడ్డి, డోన్శాసనసభ్యురాలు సుజాతమ్మరాజీనామా విషయంపై మాట్లాడడానికిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి నిరాకరించారు. కోట్లదంపతుల రాజీనామాల విషయంతనకు తెలియదని ఆయనబుధవారం విలేకరులతోఅన్నారు.
తమరాజీనామాకు సంబంధించిన విషయంపైమాట్లాడడానికి డోన్శాసనసభ్యురాలు సుజాతమ్మనిరాకరించారు. తన భర్త, కర్నూలులోక్సభ సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఢిల్లీలో వున్నారని, ఆయనవచ్చాక కారణాలు ఏమిటో తెలుస్తాయని,ఆయన నిర్ణయానికి తాను కట్టుబడివుంటానని ఆమె అన్నారు. కోట్లసూర్యప్రకాష్ రెడ్డి వచ్చినతర్వాత సుజాతమ్మ తనరాజీనామా లేఖను స్పీకర్ కె. ఆర్.సురేష్ రెడ్డికి అందజేసే అవకాశంఉందని భావిస్తున్నారు.
ఆవేదనతోకోట్ల దంపతులు వున్నారని, వారికికాంగ్రెస్ పట్ల నిబద్ధత, గౌరవంఉన్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు.ఆయన బుధవారంనాడు కోట్లదంపతులతో ఫోన్లో మాట్లాడారు.జిల్లాలోని పాలనావ్యవహారాల విషయంలోవారు కలత చెందినట్లున్నారని ఆయనఅన్నారు.