వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలైట్‌గణేష్‌ను విడుదల చేయండి: వార్‌ప్రతినిధులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మాగుంట సుబ్బరామిరెడ్డి హత్యకేసులో నిందితుడు, పీపుల్స్‌వార్‌నక్సలైట్‌ పి.బి. గణేష్‌ను విడుదలచేయాలని పీపుల్స్‌వార్‌ ప్రతినిధులు,విప్లవ రచయితలువరవరరావు, జి. కళ్యాణరావుగవర్నర్‌ సుర్జిత్‌ సింగ్‌ బర్నాలానుకోరారు. వారు శుక్రవారంనాడుగవర్నర్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తిచేశారు. వారు గురువారం హోంమంత్రి కె. జానారెడ్డిని కలిసి ఇదేవిన్నపం చేశారు.

గణేష్‌గత ఎనిమిది సంవత్సరాలుగా ఎనిమిదినెలలుగా జీవిత ఖైదీగా జైళ్లోవుంటున్నాడని, ఈ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా కొందరుఖైదీలను ప్రభుత్వం విడుదలచేయబోతున్నట్లు తెలుస్తోందని, ఈసందర్భంగా గణేష్‌ను విడుదలచేయాలని కోరామని వరవరరావువిలేకరులతో చెప్పారు. ఐజి గానీ, డిజి గానీరెమిషన్‌ ఇచ్చి వుంటే పది సంవత్సరాలకాలం పూర్తయ్యేదని, నక్సలైట్‌ అనేకారణంతో రెమిషన్‌ ఇవ్వలేదని,అయితే గణేష్‌ ప్రవర్తనుపరిగణనలోకి తీసుకొని విడుదలచేయాలని కోరామని ఆయన అన్నారు.ప్రకాశంజిల్లాలో శ్యామల, ఖదీర్‌, అరుణ, జ్యోతి అనేవారినిపొటా కింద అరెస్టు చేశారని, పొటానురద్దు చేస్తున్నందున వారివిడుదలకు చర్యలు తీసుకోవాలని తాముహోం మంత్రిని కోరామని కళ్యాణరావుచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X