వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్షాలనుపరిగణనలోకి తీసుకుంటాం: డియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై,నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లపైప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలనుపరిగణనలోకి తీసుకుంటామనిప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిడి. శ్రీనివాస్‌ చెప్పారు. విమర్శలనువిమర్శలుగా కాకుండా ఆ విమర్శల్లోఏవైనా మంచి అంశాలుంటే పరిగణనలోకితీసుకుంటామని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

తమమూడు నెలల తమ ప్రభుత్వం ఏవైనాతప్పులు చేసి వుంటేసరిదిద్దుకుంటామని ఆయన అన్నారు.తమ ప్రభుత్వం ఏవైనా తప్పులు చేసివుంటే అవి ఉద్దేశ్యపూర్వకంగాచేసినవి కావని ఆయన అన్నారు. ఎన్నికలప్రణాళికలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడానికి ప్రభుత్వం చర్యలుతీసుకుంటున్నదని ఆయన అన్నారు.నామినేటెడ్‌పదవుల్లో పార్టీనాయకులకు న్యాయంజరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.నామినేటెడ్‌ పదవుల భర్తీ అంతసులభం కాదని, పదవులు ఆశించేవారుచాలా మంది వున్నారని ఆయన అన్నారు.అర్హులైనవారికి పదవులు ఇవ్వాలనేఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పదవులభర్తీలో జాప్యం చేస్తూ వుండవచ్చుననిఆయన అన్నారు. తాను, ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఈనెల ఇరవయ్యవ తేదీన ఢిల్లీకివెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా తాను సోనియాగాంధీనిప్రత్యేకంగా కలుస్తానని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X