వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలమంటంపై మాట మార్చిన యంయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తిరుమలలో వేయి కాళ్ల మండపంపైదేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావు మాటమార్చారు. వేయి కాళ్ల మండపాన్నియధావిధిగా నిర్మిస్తామని చెప్పినమంత్రి ఇప్పుడు మరో మాటమాట్లాడుతున్నారు.

నిపుణులకమిటీ నివేదిక సూచనల మేరకువేయి కాళ్ల మండపంపునర్నిర్మాణంపై నిర్ణయంతీసుకుంటామని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. ఈమండపం నిర్మాణంపై తిరుమలతిరుపతి దేవస్థానం చైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డితో కలిసి మీరు ఇచ్చినఆదేశాలు ఏమవుతాయని విలేకరులుఅడిగితే ఇదంతా మీడియా సృష్టించినగందరగోళమని వ్యాఖ్యానించారు.వేయికాళ్ల మండపాన్ని యధావిధిగాపునర్నిర్మించాలని చిన జీయర్‌ స్వామిడిమాండ్‌కు మొదట సత్యనారాయణరావు సానుకూలంగా ప్రతిస్పందించారు.దాన్ని గతంలో ఉన్న మాదిరిగానే తిరిగినిర్మిస్తామని ఆయన చెప్పారు. దీనిపైముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి విభేదించారు.సత్యనారాయణరావు ప్రకటననువిభేదిస్తూ ఆయన మంగళవారంవిలేకరుల వద్ద మాట్లాడారు."మాకు పెద్దాయన ఉన్నారు.ఆయనేదో మాట్లాడుతుంటారు. అది మీకుతెలిసిందే కదా! అనే పద్ధతిలోవైయస్‌ సత్యనారాయణరావుపైవ్యాఖ్యానించారు.వేయికాళ్ల మంటపం నిర్మాణానికిప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వునుపునఃపరిశీలిస్తామని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిబుధవారం తిరుమలలో చెప్పారు.రెండు రోజుల పాటు కడప, చిత్తూరు జిల్లాల్లోపర్యటించిన ఆయన బుధవారంనాడుతిరుమల సందర్శించారు. వేయి కాళ్లమండపం స్థలాన్ని ఆయన పరిశీలించారు.తిరుమల వేయి కాళ్ల మంటపంవిషయంలో వివాదం చోటు చేసుకున్నదని,దాన్ని పరిష్కరించే ప్రయత్నంప్రభుత్వం చేస్తోందని ఆయనఅన్నారు. అంతా శాస్త్ర ప్రకారమేజరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X