వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికుయుక్తులు ప్రజలు నమ్మరు:వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశంపార్టీ కుయుక్తులను ప్రజల నమ్మబోరనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.అనంతపురం జిల్లాలోని హత్యలపైతెలుగుదేశం రాజకీయం చేస్తోందనిఆయన వ్యాఖ్యానించారు.

రెండురోజుల పాటు కడప, చిత్తూరు జిల్లాల్లోపర్యటించి బుధవారం హైదరాబాద్‌వచ్చిన రాజశేఖర్‌ రెడ్డి కొద్ది సేపువిలేకరులతో మాట్లాడారు.అనంతపురం జిల్లాలో జరుగుతున్నహత్యలపై తాము నిష్పాక్షికంగావ్యవహరిస్తున్నామని ఆయనచెప్పారు.గతంలోనిహత్యా రాజకీయాల సంస్కృతినినిర్మూలించే దిశలో తాము పని చేస్తూవస్తున్నామని, గత సంస్కృతివల్లనే ఇంకా అక్కడా ఇక్కడా హత్యలుజరుగుతున్నాయని ఆయన అన్నారు.వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాల వల్లజరుగతున్న హత్యలకుతెలుగుదేశం పార్టీ రాజకీయ రంగుపులుముతోందని ఆయన విమర్శించారు.అనంపుతరంలో తెలుగుదేశంతలపెట్టిన ధర్నాపై ఆయనఆశ్చర్యం వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X