నరేంద్రఉద్వాసనకు సిపిఐ డిమాండ్
ఈఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి జులై ఇరవైతొమ్మిదవ తేదీ వరకు జరిగిన జిటిబిట్రేడింగ్పై సెబీ దర్యాప్తు జరిపిందనిఆయన తెలిపారు. సెబీ తనదర్యాప్తును ఇంకా ముగించలేదనిఆయన అన్నారు. రమేష్ గెల్లి ఇరవైఒక్క లక్షల ఆరవై ఏడు వేల మూడువందల పద్దెనిమిది షేర్లను,ప్రేమకళా గెల్లి ఇరవై రెండు లక్షలయాబై ఆరు వేల నాలుగు వందలముప్పై ఏడు షేర్లను, గిరీష్ గెల్లీ తొమ్మిదిలక్షల యాబై ఐదు వేల ఆరు వందలయాబై ఒక్క షేర్లను ఈ మధ్యకాలంలోవిక్రయించినట్లు సెబీ దర్యాప్తులోతేలిందని మంత్రి చెప్పారు.అన్నపూర్ణ శ్రీధర్ మూడు లక్షల ఎనబైఐదు వేల ఐదు వందల తొంబై ఐదుషేర్లను, నీరజ్ గెల్లీ పద్నాలుగు లక్షలఎనబై ఆరు వేల ఏడు వందల ఎనబైఏడు షేర్లను విక్రయించారని తేలినట్లుఆయన తెలిపారు.జిటిబికార్యకలాపాలపై ప్రభుత్వం జులైఇరవై నాలుగవ తేదీన మారిటోరియంవిధించింది. అశోక్ మిట్టల్ అండ్ కంపెనీ,క్లారిడ్జెస్ ఇన్వెస్ట్మెంట అండ్ ఫైనాన్స్,యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మారిటోరియంవిధించిన తర్వాత షేర్లనువిక్రయించినట్లు మంత్రి తెలిపారు.