రూ.
తెలంగాణప్రజలు టి ఆర్యస్కు గుణపాఠంచెప్తారని వారన్నారు. తెలంగాణ ప్రజలమనోభావాలతో టి ఆర్యస్ రాజకీయంచేస్తోందని వారు విమర్శించారు.గ్రామాలకు వెళ్తే రాళ్లతో కొడ్తారనితెలంగాణ ప్రజలను నిశ్శబ్దంగా ఉండాలనిచంద్రశేఖర్ రావు కోరుతున్నారనివారన్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే పద్ధతులు మానుకోవాలని వారుటి ఆర్యస్ను కోరారు.అయోమయాన్ని నివారించడానికితెలంగాణపై కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియా గాంధీతో స్పష్టమైన ప్రకటనచేయించాలని వారు కాంగ్రెస్, టిఆర్యస్ నాయకులకు విజ్ఞప్తిచేశారు.భూకబ్జాకుపాల్పడినట్లు టి ఆర్యస్ రాష్ట్రమంత్రి విజయరామారావుపైస్పష్టమైన సాక్ష్యాలున్నాయనివారన్నారు. సాక్ష్యాలు ఉన్నా ఇదంతాతెలుగుదేశం కుట్ర అనివిజయరామారావు అనడంవిడ్డూరమని వారన్నారు.మంత్రివర్గం నుంచివిజయరామారావును తొలగించాలనివారు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి చర్య తీసుకోకపోతేగవర్నర్కు ఫిర్యాదు చేస్తామనివారు చెప్పారు.