రూ.
కోర్టుచుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలోబుధవారం నిషేధాజ్ఞలు అమలు చేశారు.మీడియా ప్రతినిధులను కూడా కోర్టుఆవరణలోకి అనుమతించలేదు.ఉమాభారతి బుధవారం కోర్టులోలొంగిపోయారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిత్రివర్ణ పతాకంఎగురవేసినందుకుఉమాభారతితో పాటు మరో ఇరవై ఒక్కమందిపై పదేళ్ల క్రితం కేసునమోదు చేశారు. ఉమాభారతిని బెల్గాంజైలుకు తరలించారు.ఉమాభారతికోర్టులో లొంగిపోయే సమయంలో అక్కడతీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుఆందోళనకు దిగారు. పోలీసులు బిజెపికార్యకర్తలపై లాఠీ చార్జి చేశారు.ఉమాభారతిపై కేసుతిరగదోడినందుకు నిరసనగాగురువారం మధ్యప్రదేశ్,కర్ణాటకల బంద్ నిర్వహించాలని బిజెపిపిలుపునిచ్చింది.త్రివర్ణపతాకం ఎగురువేసినందుకు బిజెపినేత ఉమా భారతికి అరెస్టు వారంట్జారీ చేయలేదని, ఘర్షణలకు దారి తీసికొందరి మృతికికారణమైనందుకు ఉమా భారతిఅరెస్టుకు వారంట్ జారీ అయిందనికర్ణాటక ముఖ్యమంత్రిధరమ్సింగ్ చెప్పారు. ఉమా భారతికేసు వ్యవహారంలో కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రమేయంలేదని ఆయన స్పష్టం చేశారు.