వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింలఅణచివేతపై న్యాయవిచారణకుడిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తీవ్రవాదుల పేరుతో 1998నుంచి 2004వరకు ముస్లిం యువకులపైచేపట్టిన అణచివేత చర్యల మీదన్యాయవిచారణ జరిపించాలని మజ్లీస్‌తోసహా పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డినికోరాయి. లేదా నిష్పాక్షిక విచారణజరిపించాలని విజ్ఞప్తి చేశాయి. మజ్లీస్‌నాయకులు సల్లావుద్దీన్‌ ఓవైసీ,అసదుద్దీన్‌ ఓవైసీ, అక్బరుద్దీన్‌ఓవైసీలతో సహా ముస్లిం సంస్థలప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రినికలిశారు. సికింద్రాబాద్‌లోని గణపతిదేవాయలంపై కుట్ర పన్నారనేఆరోపణపై ఎనమండుగురిని పోలీసులుఅరెస్టు చేసిన నేపథ్యంలో వారుముఖ్యమంత్రిని కలిశారు.

పోలీసుల్లోనిసంఘ్‌పరివార్‌వారిని తప్పలించాలనివారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.బిజెపి భావజాలంతో పని చేస్తున్నతెలుగుదేశం పార్టీని ఓడించామన్నసంతోషం తమలో ఎక్కువ కాలంనిలవలేదని సల్లావుద్దీన్‌ ఓవైసీఅన్నారు. ముస్లింలు ఓటు వేసి కాంగ్రెస్‌నుగెలిపించాలరని ఆయన అన్నారు. మీరుఓటు వేయమంటే కాంగ్రెస్‌కు ఓటువేశాం,మాపై ఈ కక్ష సాధింపు చర్యలేమిటనిముస్లింలు తమనుఅడుగుతున్నారని ఆయన అన్నారు.ఏదోవిధమైన సంచలనం సృష్టించానికిహైదరాబాద్‌ నగర పోలీసుకమీషనర్‌ ఆర్‌.పి. సింహ్‌ప్రయత్నిస్తున్నారని అసదుద్దీన్‌ ఓవైసీఅన్నారు. రెండు మూడు రోజుల్లో పరిశీలించితగిన చర్యలు తీసుకుంటామనిముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయనతెలిపారు. ముఖ్యమంత్రి హామీపైతమకు నమ్మకం ఉన్నదని,అందువల్ల ఆందోళన చేపట్టడం లేదనిఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X