సంస్కరణలకుమేం వ్యతిరేకం కాదు: వైయస్
బెంగుళూర్లోజరిగిన సి. ఐ. ఐ. సదస్సులో పాల్గొని వచ్చినఅనంతరం ఆయన శుక్రవారంమీడియా ప్రతినిధులతో మాట్లాడారు.తీవ్రవాదం, తెలంగాణ అంశాలపైపారిశ్రామికవేత్తలు వ్యక్తం చేసినఅనుమానాలను నివృత్తి చేశానని, ఆఅంశాలు పెట్టుబడులకు ఆటంకం కాదనిఆయన అన్నారు. సి. ఐ. ఐ. సదస్సుసందర్భంగా తాను పదమూడుకంపెనీల ప్రతినిధులతో ముఖాముఖిమాట్లాడినట్లు ఆయన తెలిపారు.తామురైతులకు ప్రాధాన్యంఇస్తున్నప్పటికీ ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, బయో టెక్నాలజీలకు ప్రాధాన్యంతగ్గించబోమని ఆయన చెప్పారు.మౌలిక సదుపాయాల గురించి తాను వారికివివరించినట్లు ఆయన తెలిపారు.హైదరాబాద్లోనే కాకుండావిశాఖపట్నంలో కూడా మౌలిక సదుపాయాలుకల్పిస్తామని ఆయన చెప్పారు. ఆటోమొబైల్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటుకు భూమిఇస్తామని కేంద్రానికి తెలియజేసినట్లుఆయన తెలిపారు. యంటి ఆర్ అనేసంస్థ రాష్ట్రంలో ఫుడ్ పార్క్ స్థాపనకుఆసక్తి ప్రదర్శిస్తోందని ఆయనచెప్పారు.