నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
చర్చలసమయంలో ఆయుధాలు పక్కన పెట్టాలనేప్రభుత్వ సూచనపైనే హోం మంత్రికి,పీపుల్స్వార్ ప్రతినిధులకు మధ్యప్రధానంగా చర్చ సాగింది. కనీసంచర్చలు జరిగే సమయంలోనైనా ఆయుధాలులేకుండా రాజకీయ ప్రచారం చేసుకోవాలనిహోం మంత్రి సూచించారు. అయితే ఈవిషయంలో పీపుల్స్వార్ ప్రతినిధులు పట్టువీడలేదు. ఈ అంశాన్ని పక్కన పెట్టి చర్చలుసాగించాలని, ఈ అంశంపై పీపుల్స్వార్నాయకులతో జరిగే ముఖాముఖి చర్చల్లోఎజెండాగా చేర్చవచ్చునని పీపుల్స్వార్ప్రతినిధులు సూచించారు. దీంతో నిర్ణయాన్నిముఖ్యమంత్రికే వదిలేస్తున్నట్లు జానారెడ్డి చెప్పారు.
చర్చలకుముందు వరవరరావుప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.చర్చల విషయంలో ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.చర్చలను విఫలం చేయడానికి గతప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లకుపాల్పడితే ఈ ప్రభుత్వం కోవర్టులతోహత్యలకు దిగుతోందని ఆయన అన్నారు.డిజిపి సుకుమారకు, వరంగల్యస్పి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వంస్వేచ్ఛ ఇచ్చి రాజకీయ ప్రకటనలుచేయిస్తోందని ఆయన అన్నారు.