వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రకుతుంగభద్ర నీరు: ధరమ్‌ సింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌కు తుంగభద్ర నీరువిడుదల చేస్తామని కర్ణాటకముఖ్యమంత్రి ధరమ్‌ సింగ్‌ చెప్పారు.తాను కర్ణాటక ముఖ్యమంత్రిగాఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్‌కు నీటిసమస్య రాకుండా చూస్తామని ఆయన హామీఇచ్చారు. ధరమ్‌ సింగ్‌నుమంగళవారం గాంధీభవన్‌లోఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ బిసిసెల్‌ సన్మానించింది.

ఈ సన్మానకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌,లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనేత జి.వెంకటస్వామి పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఇరు రాష్ట్రాల మధ్యఉన్న జలవివాదం ప్రస్తావనకు వచ్చింది.అంతకు ముందు ధరమ్‌ సింగ్‌కుకాంగ్రెస్‌ నాయకులు వి.హనుమంతరావు, తదితరులుబేగంపేట విమానాశ్రయంలో స్వాగతంచెప్పారు.తానుకర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంఆంధ్రప్రదేశ్‌కు న్యాయంగా నీరుఇచ్చేందుకు కృషి చేస్తానని ధరమ్‌సింగ్‌ చెప్పారు. పది, పదిహేను రోజులక్రితం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిబెంగుళూర్‌ వచ్చారని, అప్పుడు కూడానీళ్ల గురించి అడిగారని ఆయన చెప్పారు." ఆంధ్రప్రదేశ్‌ మా పొరుగురాష్ట్రం. పైగా ఇక్కడా అక్కడా కాంగ్రెస్‌ప్రభుత్వాలే ఉన్నాయి. జెడి (యస్‌)మద్దతుతో మా ప్రభుత్వంనడుస్తోంది. మేం అధిష్ఠానం ఆదేశాలమేరకు నడుచుకోవాల్సి ఉంటుంది ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X