వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తోపులాటలోచిరిగిన మువ్వన్నెల జెండా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/వరంగల్‌/కరీంనగర్‌: తెలంగాణ విమోచనదినోత్సవం సందర్భంగా భారతీయజనతా పార్టీ (బిజెపి) నాయకులుశుక్రవారం నాడు సికింద్రబాద్‌లోనిపరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్నిఆవిష్కరించారు. దీనికి పోలీసుల నుంచి ఎటువంటిఅభ్యంతరం వ్యక్తం కాలేదు. వచ్చేఏడాది నుంచైనా ఈ ఉత్సవాలను ప్రభుత్వంఅధికారికంగా నిర్వహించాలని బిజెపిరాష్ట్రాధ్యక్షుడు యన్‌.ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌ చేశారు.

మాజీకేంద్ర మంత్రి బండారుదత్తాత్రేయ తెలంగాణ సాయుధపోరాట కాలంలో విశేష ప్రచారంలో ఉన్న బండియాదగిరి రాసిన "బండెనుక బండిగట్టి/ పదహారు బండ్లు గట్టి అనేపాటను పాడి కార్యకర్తలతోపాడించారు.కాగా,వరంగల్‌లో బిజెపి నిర్వహించిన ర్యాలీహింసాత్మకంగా మారింది. జాతీయ జెండాచిరిగి పోయింది. తెలంగాణ విమోచనదినోత్సవం సందర్భంగావరంగల్‌లోని వేయి స్తంభాల మంటపంనుంచి ఊరేగింపు మొదలైంది. పోలీసుపరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకనుఆవిష్కరించడానికి ప్రయత్నించిన బిజెపినాయకులకు, కార్యకర్తలకు మధ్యతోపులాట జరిగింది. బిజెపి నాయకులను,కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. జాతీయ జెండా పట్టుకొనిఅరెస్టవుతామని పట్టుబట్టినకార్యకర్తల నుంచి పోలీసులు జెండాలాక్కునే ప్రయత్నం చేశారు. ఈ గొడవలోజాతీయ జెండా చిరిగిపోయింది.కరీంనగర్‌లోపోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాఎగురవేయడానికి ప్రయత్నించిన బిజెపికార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జిచేశారు. ఇందులో పలువురుగాయపడ్డారు. తమ కార్యక్రమానికిరాకుండా పోలీసులు కార్యకర్తలనుఅడ్డుకున్నారని బిజెపి నాయకుడు శేషగిరిరావు ఆరోపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X