వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసియాఛాంప్ ఫైనల్లో సానియా ఓటమి
న్యూఢిల్లీ:భారత ప్రధాని మన్మోహన్ సింగ్,పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ముషార్రఫ్ల మధ్య తొలిసారిసమావేశం జరగునుంది. ఈ ఇద్దరు ఈనేతలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీనన్యూయార్క్లో సమావేశమవుతారు.తద్వారా చర్చల ప్రక్రియ ముందుకుసాగగలదని భావిస్తున్నారు.
పాకిస్థాన్అధ్యక్షుడు ముషార్రఫ్తో భేటీవుంటుందని, పాకిస్థాన్తో చర్చలప్రక్రియలో ఇది మరో ముందడుగు అనిప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.తొమ్మిది రోజుల బ్రిటన్, అమెరికా పర్యటనలకుబయలుదేరే ముందు ఆయనవిలేకరులతో మాట్లాడారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలోముషార్రఫ్ ఇరవై రెండవ తేదీనప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ను ఆయన ఇరవై ఒకటవతేదీన కలుస్తారు. ద్వైపాక్షికసమావేశంలో ముషార్రఫ్,మన్మోహన్ సింగ్ పరస్పరంతెలుసుకోవడానికిఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Comments
Story first published: Sunday, September 19, 2004, 23:53 [IST]