వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ముఖాముఖి చర్చలకు రాష్ట్ర ప్రభుత్వంనక్సలైట్‌ నాయకులను ఆహ్వానించింది. ఈమేరకు హోం మంత్రి కుందూరుజానారెడ్డి పీపుల్స్‌వార్‌, జనశక్తినాయకులకు రాసిన లేఖనుపీపుల్స్‌వార్‌ ప్రతినిధివరవరరావుకు పంపారు. ఈచర్చలు వచ్చే నెల రెండవ తేదీ నుంచిప్రారంభం కావాలని సూచించినట్లు జానారెడ్డిగురువారం విలేకరులతో చెప్పారు.

బేషరతుగానక్సలైట్లను చర్చలకు ఆహ్వానించినట్లుఆయన తెలిపారు. ఆయుధాలతో జనావాసాల్లోసంచరించకూడదనే నిబంధననుపక్కన పెట్టకపోతే చర్చలు ఆగిపోతాయనేఊహాగానాలకు తెరపడింది. ముఖాముఖిచర్చలకు ఆయుధాలు ఎజెండా కాదనిజానారెడ్డి చెప్పారు. పీపుల్స్‌వార్‌,జనశక్తి నాయకులకు రాసిన లేఖలోనిఅంశాలను వెల్లడించడానికి ఆయననిరాకరించారు. "ఈ లేఖ వారికిచేరనివ్వండి, వారిని చర్చలకు ఆహ్వానించాంఅని ఆయన అన్నారు. చర్చల్లో పాల్గొనేనక్సలైట్‌ నాయకులకు సేఫ్‌ పాసేజ్‌కల్పిస్తామని, వారికి అవసరమైనభద్రత కూడా కల్పిస్తామని ఆయనచెప్పారు.అంతకుముందు పీపుల్స్‌వార్‌, జనశక్తిప్రతినిధులు గంగన్న, చంద్రన్న హోంమంత్రి జానారెడ్డిని కలిశారు. అయితేపీపుల్స్‌వార్‌, జనశక్తి పార్టీలకురాసిన లేఖను పీపుల్స్‌వార్‌ ప్రతినిధివరవరరావు ఇంటికి పంపిస్తామనిహోం మంత్రి చెప్పినట్లు వారు తెలిపారు.రెండవ తేదీన చర్చలకుఆహ్వానిస్తున్నట్లు మంత్రి తమకుతెలిపారని వారన్నారు. అయితే ఈ నెలముప్పయవ తేదీన హైదరాబాద్‌లోపీపుల్స్‌వార్‌, జనశక్తి సంయుక్తంగాబహిరంగ సభనునిర్వహిస్తున్నందును చర్చలప్రారంభానికి మరి కొంత గడువు కోరేఅవకాశాలున్నాయని చంద్రన్నతెలిపారు. చర్చలకు వేదిక ఎక్కడనేదితమకు తెలియదని ఆయన చెప్పారు.నక్సలైట్‌ నాయకులతో పాటు తాముకూడా చర్చల్లో పాలు పంచుకుంటామనిఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X