వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:అనంతపురం జిల్లా ఆత్మకూరుమండలం మదిగుబ్బలో కానిస్టేబుల్‌నునగ్నంగా ఊరేగించి చితక బాదినసంఘటనలో కేసులను ప్రభుత్వంఉపసంహరించుకుంటే ఊరుకోబోమని పోలీసుఅధికారుల సంఘం అధ్యక్షుడుఅనంతరాములు హెచ్చరించారు. పోలీసుఅధికారుల సంఘం నాయకులుశుక్రవారం కానిస్టేబుల్‌నుపరామర్శించారు. వరంగల్‌ జిల్లామొగిలిచెర్ల కేసు మాదిరిగా ఈ కేసునుఉపసంహరించుకుంటే సహించబోమనిఅనంతరాములు అన్నారు.

మదిగుబ్బసంఘటనకు బాధ్యులైనవరవరరావు, కళ్యాణ్‌రావుపీపుల్స్‌వార్‌ ప్రతినిధులుగా చర్చలనుంచి వైదొలగాలని ఆయన డిమాండ్‌చేశారు. కానిస్టేబుల్‌పై దాడి చేసినవరవరరావు, కళ్యాణ్‌రావులను,ఇతర పీపుల్స్‌వార్‌సానుభూతిపరులను అరెస్టు చేసిరిమాండ్‌కు పంపాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు. పీపుల్స్‌వార్‌ పెట్టాల్సిందిసంస్మరణ సభలు కాదని, సంస్కరణసభలు పెట్టాలని ఆయన అన్నారు.పీపుల్స్‌వార్‌ అరాచకాలను ప్రజలుగమనిస్తున్నారని ఆయన అన్నారు.మదిగుబ్బలోకానిస్టేబుల్‌పై దాడి సంఘటనలోస్పష్టమైన ఆధారాలున్నాయని, ఈ కేసులోఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా పోలీసుసూపరింటిండెంట్‌ ప్రవీణ్‌కుమార్‌అన్నారు. ప్రజలు ఆ దుర్మార్గాన్ని చూశారని,కేసు విచారణ సాగుతోందని ఆయనఅన్నారు. వరవరరావు,కళ్యాణ్‌రావుల విషయంలో కూడా చట్టంతన పని తాను చేసుకుని పోతుందనిఆయన అన్నారు. ఈ సంఘటనలోనినిందితులను వెంటాడి వేటాడైనాపట్టుకుంటామని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X