పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి
అమృత్సర్: ఎనిమిదిరాష్ట్రాల మీదుగా పదిహేను రోజులుగా మూడువేల కి.మీ దూరం సాగిన తిరంగా యాత్రకుచారిత్రాత్మక జలియన్వాలా బాగ్ ప్రాంతంలోబిజెపి నాయకురాలు ఉమాభారతి ముగింపుపలికారు. జలియన్వాలా బాగ్లో జరిగిన కార్యక్రమానికిహాజరైన మాజీ ప్రధాని వాజ్పేయికి హుబ్లినుంచి మోసుకొచ్చిన జెండాను ఉమాభారతిఅందజేశారు.
అరుణ్జైట్లీ, అనంత్కుమార్,షానవాజ్ హుసేన్, నవ్జోత్ సింగ్సిద్ధూ, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడుప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడేగుమిగూడినదాదాపు వెయ్యి మందిని ఉద్దేశించి ఉమాభారతిప్రసంగిస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రి చేపట్టినయాత్రకు సాక్షాత్తూ దేశ మాజీ ప్రధాని,ఉప ప్రధానులు మద్దతు పలకటంవిశేషమనివారికి ధన్యవాదాలు తెలిపారు.
ఉదయంలూధియానా నుంచి అమృత్సర్కు యాత్రప్రయాణించిన సమయంలో శిరోమణిఅకాలీ దళ్(మన్) కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించారు.ఇద్దరు మహిళలు ముందుకు దూసుకొచ్చి ఉమాభారతివెనుదిరుగు అంటూ నినాదాలు చేశారు. జెండాపట్ల ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్,మన్ లు ప్రదర్శించిన అగౌరవం ఈ విధంగాప్రకటితమైందని ఉమ విమర్శించారు.