కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
హైదరాబాద్:వినాయకుని లడ్డూ రెండు లక్షలరూపాయలు పలికింది. రంగారెడ్డి జిల్లాబాలాపూర్కు చెందిన వినాయకుడనిలడ్డును కొలను మోహన్ రెడ్డి అనేవ్యక్తి రెండు లక్షల రూపాయలకువేలం పాటలో కొనుక్కున్నాడు. గత నాలుగుసంవత్సరాలుగా అతనే ఈ లడ్డూనుస్వాధీనం చేసుకుంటున్నాడు.
ఇరవైఒక కిలోల వినాయకుని లడ్డూ వేలం పాటముప్పై వేల రూపాయల నుంచిప్రారంభమై రెండు లక్షలరూపాయలకు చేరుకుంది. వేలం పాటలోపదిహేను మంది దాకా పాల్గొన్నారు. వేలంపాటలో బాలాపూర్ గ్రామస్థులే కాకుండాచుట్టుపక్కల గ్రామాలవారు కూడాపాల్గొన్నారు. వేలం పాటలో పాల్గొనేవారుముందు ఐదు వందల రూపాయలుడిపాజిట్ చేయవలసి వుంటుంది. పందొమ్మిదివందల తొంబై నాలుగులో ఈ లడ్డూ వేలం పాటప్రారంభమైంది. ఈ సంవత్సరంలోలడ్డూ నాలుగు వందల యాబైరూపాయలకు అమ్ముడైంది.
ఈలడ్డూను సొంతం చేసుకుంటేఅష్టయిశ్వరాలు సమకూరుతాయనివిశ్వాసం. లడ్డూలో కొంత భాగం తనవ్యవసాయ బావిలో వేస్తానని, మిగతాదిఅందరికీ పంచి పెడుతానని మోహన్రెడ్డి అంటున్నాడు. దీని వల్ల పంటలు బాగాపండుతాయని అతను అంటున్నాడు. లడ్డూఅమ్మగా వచ్చిన రెండు లక్షలరూపాయలను ఆంజనేయ స్వామి గుడినిర్మాణానికి వెచ్చిస్తామని గ్రామస్థులుచెప్పారు.