వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి, ఆయన కుమారుడుజగన్మోహన్‌ రెడ్డిల నుంచి తనప్రాణాలకు ముప్పు ఉన్నదనిఅనంతపురం జిల్లా పెనుకొండతెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవీంద్ర ఆరోపించారు. జగన్‌కనుసన్నల్లోనే పోలీసులు తన ఇళ్లపైదాడులు చేస్తున్నారని ఆయన బుధవారంవిలేకరులతో అన్నారు.

జగన్‌ కనుసన్నల్లోనే తెలుగుదేశంపార్టీ కార్యకర్తలనుహతమారుస్తామని జనరక్షణ సమితిప్రకటించిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిప్రోద్బలంతోనే తన ఇళ్లపై పోలీసుదాడులు జరుగుతున్నాయని పరిటాలరవీంద్ర అన్నారు. తనపై కక్షసాధింపు చర్యలో భాగంగా పోలీసు దాడులుజరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

అనంతపురంజిల్లాలో తెలుగుదేశం పార్టీకార్యకర్తలను నిర్మూలించే పనికికాంగ్రెస్‌ ఒడిగట్టిందని ఆయన అన్నారు .తమ పార్టీ కార్యకర్తలను హత్యచేసినవారిని పోలీసులు అరెస్టు చేయకుండాపక్షపాత ధోరణి అవలంభిస్తున్నారనిఆయన అన్నారు. ఒక పద్ధతి ప్రకారంఅనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ కార్యకర్తల హత్యలుజరుగుతున్నాయని ఆయన అన్నారు.

అనంతపురంలోనిపరిటాల రవీంద్ర ఇంటిలో పోలీసులుమంగళవారంనాడు సోదాలునిర్వహించారు. అంతకు ముందువెంకటాపురంలోని ఇంటిలో సోదాలునిర్వహించారు. పరిటాలపైమంగళవారం మరో కిడ్నాప్‌ కేసునమోదైంది. అంతకు ముందు తొమ్మిదిరోజుల క్రితం మద్దెలచెర్వుసూర్యనారాయణ అనుచరుడు కుమ్మరిసూరిని కిడ్నాప్‌ చేశారనే ఆరోపణపై పరిటాలమీద కేసు నమోదైంది. జూబిలీహిల్స్‌కారుబాంబు కేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డిని కిడ్నాప్‌ చేశారనే ఆరోపణపైపరిటాల రవి మీద మంగళవారం కేసునమోదైంది. మొత్తంగా పరిటాల రవిచుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్న సూచనలుకనిపిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X