పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి
హైదరాబాద్:అనంతపురం జిల్లాలో జరిగినవి రాజకీయహత్యలనడం తెలుగుదేశం పార్టీఅవివేకానికి నిదర్శనమని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅన్నారు. ఈ హత్యలపై విచారణకు రిటైర్డ్జడ్జిని వేసిన తర్వాత వాటిపైతెలుగుదేశం ప్రతి రోజూ మాట్లాడడం సరికాదని ఆయన బుధవారంవిలేకరులతో అన్నారు.
ఆ కమిటీనివేదిక వస్తే అనంతపురం జిల్లాలోజరిగిన హత్యల విషయంలో వాస్తవాలుతెలుస్తాయని ఆయన అన్నారు. ఈ హత్యలవెనక రాజకీయాల జోక్యం ఉందా అనేఅంశం కూడా విచారణ కమిటీ అంశాల్లోఉన్నదని ఆయన చెప్పారు. ప్రతి రోజుపరిపాలనలో జోక్యం చేసుకోవడం తనపద్ధతి కాదని, చట్టం తన పని తానుచేసుకుపోతుందని ఆయన అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లోఅవకతవకలు జరిగాయని, బినామీ పేర్లతోకాంట్రాక్టులు కట్టబెట్టారని తెలుగుదేశంపార్టీ చేసిన విమర్శను ఆయనఖండించారు. ఈ విషయం హైకోర్టులోఉన్నదని, కోర్టు తేల్చిన విషయాలను బట్టినిర్ణయాలు తీసుకుంటామని ఆయనచెప్పారు.