వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వినాయక చవితికి ముందు అరెస్టు చేసిన నసీరుద్దీన్‌ను గుజరాత్‌ పోలీసులకు అప్పగించవద్దని డిమాండ్‌ చేస్తూ ఆయన భార్యాపిల్లలు, డిజెయస్‌ మహిళా కార్యకర్తలు ఆదివారం నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష నసీరుద్దీన్‌ ఇంటి ముందు ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని గణపతి దేవాలయంలో పేలుళ్లకు కుట్ర పన్నారనే ఆరోపణపై పోలీసులు నసీరుద్దీన్‌ను అరెస్టు చేశారు.

నసీరుద్దీన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. నసీరుద్దీన్‌పై, ఇతరులపై విచారణను సి ఐడి విచారణను ఇరవై అయిదు రోజుల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్డర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని నసీరుద్దీన్‌ కూతురు అన్నారు. ఇప్పుడు గుజరాత్‌ పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. మౌలానా నసీరుద్దీన్‌ నిర్దోషి అని సి ఐడి తేల్చిందని డిజెయస్‌ అధ్యక్షుడు మహబూబ్‌ అలీ అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X