జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
తిరుపతి: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో తెలంగాణ తెర మీదికి వచ్చినప్పుడు విదర్భ వస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఈ విషయంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ( ఎ ఐసిసి) కార్యదర్శులు కూడా హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
సుశీల్ కుమార్ షిండే ఆదివారంనాడు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. విదర్భ ప్రత్యేక రాష్ట్రం గురించి తాము హామీ ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పామని, అందువల్ల ఎన్నికల్లో విదర్భ అంశం ప్రభావం పడబోదని భావిస్తున్నామని ఆయన వివరించారు. తెలంగాణ, విదర్భలపై ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ఒక నిర్ణయం తీసుకున్నదని ఆయన చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్కు, ఎన్సిపికి మధ్య సమన్వయ లోపం ఏర్పడిందనే మాట వాస్తవమేనని, దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్కు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఎన్నికల్లో వారు ఫలితాలపై ప్రభావం చూపలేరని ఆయన అన్నారు.