వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌ను గెలిపించే విషయంపై చర్చించడానికి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి హైదరాబాద్‌ నగర నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసిఫ్‌నగర్‌ ఎన్నిక విషయంలో సమన్వయం లోపించిందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఆదివారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి సనత్‌నగర్‌ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌ రెడ్డి హాజరు కాలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి నాయని నర్సింహారెడ్డి, సమాచార పౌరసంబంధాల మంత్రి షబ్బీర్‌ అలీ, సికింద్రాబాద్‌ లోక్‌సభ సభ్యుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. ఆసిఫ్‌నగర్‌ ఎన్నికపైనే కాకుండా నగర సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు షబ్బీర్‌ అలీ విలేకరులకు చెప్పారు. తాము ఐక్యంగానే ఉన్నామని, కాంగ్రెస్‌ పార్టీలో విభిన్న అభిప్రాయాలు ఉండడం సహజమేనని, అయితే అందరూ అధిష్ఠాన వర్గం మాటకు కట్టుబడి పని చేసే సంప్రదాయం ఉన్నదని ఆయన వివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X