వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి వ్యవహార శైలి కన్నా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఖరి స్పష్టంగా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తెలంగాణ విషయంలో వైయస్‌ రంగులు మారుస్తున్నారని ఆయన ఆదివారం ఒక సభలో అన్నారు.

తెలంగాణకు తాము వ్యతిరేకమనే వైఖరికి చంద్రబాబు నాయుడు కట్టుబడి వున్నారని, అయితే రాజశేఖర్‌ రెడ్డి వైఖరి, వ్యవహార శైలి ప్రమాదకరంగా ఉన్నదని ఆయన అన్నారు. రాజశేఖర్‌ రెడ్డి తీరు తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి ఎన్నకల్లో పోరాడాయని, తెలంగాణ వెనుకబాటును వైయస్‌ అంగీకరించారని, ఇప్పుడు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి వైయస్‌ వ్యవహార శైలి కన్నా మిన్నగా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సిద్ధాంత కర్త, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ అన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు, వైయస్‌ ఇద్దరూ ఒకటేనని, వీరిలో తేడా లేదని తాను ఆనాడే చెప్పానని, ఈ ఇద్దరిలో ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుతావంటే తాను చంద్రబాబునే కోరుతానని ఆయన అన్నారు. చంద్రబాబు స్పష్టమైన వైఖరి వైయస్‌ డొంకతిరుగుడు వ్యవహారం కన్నా మంచిదని, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలు పోరాడాల్సిందేనని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X