వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
నెల్లూరు: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న మద్దతు కన్నా ప్రజల మద్దతు తమకే ఎక్కువగా ఉన్నదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజీవ్ పల్లెబాట సందర్భంగా ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. తాము రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉంటామని ప్రజల్లోకి వెళ్లామని, దీనికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజలు మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు.
తాము రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని, సిడబ్ల్యుసి నిర్ణయాన్నే తాను వెల్లడిస్తున్నానని, అంతకు మించి ఏమీ చెప్పడం లేదని ఆయన అన్నారు. అన్ని పార్టీలు, వామపక్షాలతో సహా ఏకాభిప్రాయానికి వస్తే తాము అందుకు సిద్ధపడుతామని ఆయన అన్నారు. మాటలు మారుస్తున్నది తాము కాదని, నరేంద్ర పూటకో మాట మాట్లాడుతూ అయోమయం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, October 4, 2004, 23:53 [IST]