వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న మద్దతు కన్నా ప్రజల మద్దతు తమకే ఎక్కువగా ఉన్నదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. రాజీవ్‌ పల్లెబాట సందర్భంగా ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. తాము రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉంటామని ప్రజల్లోకి వెళ్లామని, దీనికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజలు మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు.

తాము రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని, సిడబ్ల్యుసి నిర్ణయాన్నే తాను వెల్లడిస్తున్నానని, అంతకు మించి ఏమీ చెప్పడం లేదని ఆయన అన్నారు. అన్ని పార్టీలు, వామపక్షాలతో సహా ఏకాభిప్రాయానికి వస్తే తాము అందుకు సిద్ధపడుతామని ఆయన అన్నారు. మాటలు మారుస్తున్నది తాము కాదని, నరేంద్ర పూటకో మాట మాట్లాడుతూ అయోమయం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగుగంగ మిగిలిన పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పనులు పూర్తి చేయడానికి తొమ్మిది వందల యాబై అయిదు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరు పేట మండలాల్లో ఆయన సోమవారం రాజీవ్‌ పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నలబై లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఆడపడుచుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన అన్నారు. సూళ్లూరుపేట మండలానికి ఆయన వరాల జల్లు కురిపించారు. బాలకృష్ణాపురంలో మత్స్యకారులకు ఆయన పడవలు పంపిణీ చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు సభ్యుడు నేదురమల్లి జనార్దన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X