వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మంగళవారం రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ట్రాన్స్‌కో మాజీ అధికారి వెంకటరెడ్డి, మరి కొందరు ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్‌ ఆ దాఖలు చేశారు.

ఈ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపడుతుంది. పిటిషన్‌కు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ కోరడంతో విచారణను బుధవారం చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. పులిచింతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లేదని, ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చాలనే అంశాలపై పిటిషన్‌ దాఖలైంది.పులిచింతల ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు లేవనెత్తిన అభ్యంతరాలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తప్పు పట్టారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని విజయవాడలో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X