వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పీపుల్స్‌వార్‌ ప్రతినిధులు మంగళవారం హోం మంత్రి కె. జానారెడ్డికి తమ ప్రతిపాదిత ఎజెండా అంశాలను సమర్పించారు. నక్సల్స్‌ నేతలతో జరిపే చర్చలపై విధివిధానాల ఖరారుపై వారు జానారెడ్డితో చర్చించారు. కొనసాగుతున్న ప్రతినిధులతో పాటు మేధావులు కూడా నక్సలైట్‌ నేతలకు చర్చల్లో పాల్గొనడానికి అనుమతించాలని వారు హోం మంత్రిని కోరారు.

చర్చలకు పీపుల్స్‌వార్‌ ప్రతినిధులు పదకొండు అంశాలతో తమ ప్రతిపాదిత ఎజెండాను జానారెడ్డికి సమర్పించారు. ఉద్యమాల సందర్భంగా ప్రజలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రపంచ బ్యాంక్‌ విధానాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వం స్వావలంబన ఆర్థిక విధానాలను అవలంభించాలని, చర్చల్లో పాల్గొనే నక్సలైట్‌ నేతలకు తగిన రక్షణ కల్పించాలని, ప్రత్యేక తెలంగాణకు అంగీకరించాలని వారు ప్రతిపాదించారు. రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు, దళితులకు సంబంధించి సామాజిక న్యాయం, పేదలకు సంబంధించి విద్య, వైద్యం, సంక్షేమం, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ, ఆదివాసీలకు స్వయంపాలనాధికారం, ముస్లింలకు రిజర్వేషన్లు వంటి అంశాలను పీపుల్స్‌వార్‌ ప్రతిపాదించింది. అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపించాలని పీపుల్స్‌వార్‌ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్‌, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరులలో చర్చలు జరగాలని పీపుల్స్‌వార్‌ ప్రతిపాదించింది. వరవరరావు, కళ్యాణరావు, గద్దర్‌ హోం మంత్రి జానారెడ్డిని కలిసి చర్చల విధివిధానాలపై చర్చించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X