వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నక్సలైట్లకు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మధ్య చర్చలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అని మాజీ కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఖండించారు. నక్సలైట్లతో చర్చలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కాదని ఆయన మంగళవారం విలేకరులతో అన్నారు.

అద్వానీ అవగాహనారాహిత్యానికి ఆ ప్రకటన అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో చర్చలు అనేది ప్రతి ఒక్కరూ ఎంచుకున్న ఒక ప్రక్రియ అని ఆయన అన్నారు. అద్వానీ తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు కాశ్మీర్‌ తీవ్రవాదులతో, అస్సాంలో నాగా తీవ్రవాదులతో చర్చల ప్రక్రియను ఎందుకు ప్రారంభించారని ఆయన అడిగారు. ఆ సమయంలో అద్వానీ అవగాహనారాహిత్యం గురించి, చిత్తశుద్ధి గురించి మాట్లాడితే అది ఆలోచనా రాహిత్యమే అయి వుండేదని రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. చర్చలకు సంబంధించిన వివరాలు తెలుసుకోకుండా తమకు ఉద్దేశ్యాలు అంటగట్టడం అద్వానీ స్థాయికి తగింది కాదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X