వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

నాందేడ్‌: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం ప్రచారం చేపట్టారు. తెలుగువారు అధికంగా వున్న నాందేడ్‌ ప్రాంతంలో ప్రచారం చేయడానికి ఆయన ఇక్కడికి చేరుకున్నారు.

తెలుగువాళ్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాను ప్రచారం చేపడుతానని ఆయన బుధవారం విలేకరులతో చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌, యన్‌సిపి కూటమి గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోయినా అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నందున విజయావకాశాలు పెరుగుతాయని, రిపబ్లికన్‌ పార్టీ మద్దతు కూడా తమకు ఉన్నదని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో బిజెపి- శివసేన కలిసి పోటీ చేసినా ఓటమి చవి చూడక తప్పలేదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X