వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

నాందేడ్‌: మహారాష్ట్ర ఎన్నికల్లో సినీనటి, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ లోక్‌సభ సభ్యురాలు జయప్రద సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రచారానికి దిగారు. ఆమె బుధవారంనాడు నాందేడ్‌ జిల్లాలోని వర్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు.

కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరంగా యాత్రలో, ఫీల్‌ గుడ్‌ యాత్రల్లో మునిగిపోయిన బిజెపికి, కుంభకర్ణ నిద్ర పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆమె దుయ్యబట్టారు. రైతుల విద్యుత్‌ బకాయిలు రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం గుర్తుకు రాలేదా అని ఆమె అడిగారు. తాను ప్రసంగం చేయడానికి రాలేదని, పరిస్థితులను మార్చే అవకాశం కల్పించుకోండని చెప్పడానికి వచ్చానని ఆమె అన్నారు. రైతులు, మహిళల పరిస్థితి దుర్భరంగా మారిందని, అభివృద్ధి కుంటుపడిందని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ అసత్యాలు చెప్పుతోందని, ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తోందని జయప్రద విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X