వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: రైతులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయం ముందు పికెటింగ్‌ చేశారు. సాగర్‌ జలాలను విడుదల చేయాలంటూ మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ప్రదర్శన చేసిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో ఇద్దరు గాయపడ్డారు.

కార్యాలయంలోకి బుధవారంనాడు సిపిఐ, సిపియం కార్యకర్తలు ఎవరినీ వెళ్లనీయలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాలు ఇస్తున్న ఒక వ్యక్తి చొక్కాను ఒక కానిస్టేబుల్‌ పట్టుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. లాఠీచార్జిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రైతులను రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు పరామర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X