వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి వైద్యులు గురువారం సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి సమక్షంలో వారు ఈ సమ్మె విరమించారు. పన్నెండు మంది వైద్య ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.

తమపై పెట్టిన కేసులను ఎత్తేయాలని, గాంధీ ఆస్పత్రిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాని చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వైద్య సంఘాల ప్రతినిధులు చెప్పారు. అయితే ఈ విషయాలపై మీడియా ప్రతినిధులకు వివరణ ఇవ్వడానికి వారు ఇష్టపడలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమించామని చెప్పి హడావిడిగా సచివాలయం నుంచి వెళ్లిపోయారు.రోడ్డు ప్రమాదానికి గురైన తమ కాలేజీ విద్యార్థి మహేందర్‌ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మరణించడాని ఆగ్రహం చెందిన డివి ఆర్‌ కళాశాల ఇంజనీరింగ్‌ విద్యార్థులు మూడు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిపై దాడి చేశారు. ప్రతిగా వైద్య కళాశాల విద్యార్థులు, జూనియర్‌ డాక్టర్లు దాడులు చేశారు. ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు తీసుకొచ్చిన పది బస్సులను ధ్వంసం చేశారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు.అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రి వైద్యులు సమ్మె చేస్తున్నారు. రోగులకు ఏ విధమైన చికిత్సా అందించడం లేదు. బుధవారం హోం మంత్రి కె. జానారెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శంచి తర్వాత కూడా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో గురువారం ఉదయం వివిధ వైద్య సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X