భార్య,కుమార్తెల సమక్షంలో వీరప్పన్ ఖననం
హైదరాబాద్:హైదరాబాద్ నగరానికిఅంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టింది తమపార్టీ ప్రభుత్వమేనని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు అన్నారు.ఆసిఫ్నగర్ నియోజకవర్గంలో తమపార్టీ అభ్యర్థి అరవింద్కుమార్ గౌడ్నుగెలిపించాలని వోటర్లను కోరుతూ ఆయనశుక్రవారం సుడిగాలి పర్యటనచేశారు.
హైదరాబాద్నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపేదలకు నిలయంగా మారుస్తోందనిఆయన అన్నారు. తాము ఎనిమిది వందల కోట్లరూపాయలతో కృష్ణా జలాలను నగరానికితరలించామని ఆయన చెప్పారు.స్వార్థ ప్రయోజనాల కోసం ఆసిఫ్నగర్కుఉప ఎన్నిక జరగడానికి కారణమైనవారికిబుద్ధి చెప్పాలని ఆయన వోటర్లను కోరారు.వ్యక్తిగత ప్రయోజనాల కోసంనాగేందర్ నాలుగు నెలల లోపే మళ్లీ ఎన్నికజరగడానికి కారణమయ్యారని ఆయనవిమర్శించారు.
రాజకీయబిక్ష పెట్టాలని తన వద్దకు వస్తేగుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో తామునాగేందర్కు తెలుగుదేశం పార్టీటికెట్ ఇచ్చామని, గెలిచిన తర్వాత పార్టీఫిరాయించారని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీ గెలిచి వుంటేనాగేందర్ పార్టీ ఫిరాయించి వుండేవారాఅని ఆయన అడిగారు.