మహారాష్ట్రలోకాంగ్రెస్-ఎన్సిపి విజయం
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావునిరంకశంగా వ్యవహరిస్తున్నారనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు విమర్శించారు.సిద్ధిపేట, ఆసిఫ్నగర్లలో తమ పార్టీఅభ్యర్థులే గెలుస్తారని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.సిద్ధిపేటలో యువకులంతా తమ వైపేఉన్నారని ఆయన అన్నారు.
సిద్ధిపేటలోచంద్రశేఖర్ రావు ఫ్యూడల్వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని,తమకు వ్యతిరేకంగా పని చేసేవారిపైదౌర్జన్యాలు, దాడులు చేయిస్తున్నారని, వారినిబ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయనతీవ్రంగా ధ్వజమెత్తారు. రాజకీయాలుపవిత్రమైనవని, వాటిని చంద్రశేఖర్రావులాంటివారు కలుషితం చేయడంసరి కాదని ఆయన అన్నారు. పద్ధతిలేకుండా ఇష్టారాజ్యంగా చంద్రశేఖర్రావు వ్యవహరిస్తున్నారని,నాయకత్వాన్ని ఎదగనీయడం లేదనిఆయన అన్నారు.
అబద్ధాలుచెప్పడంలో చంద్రశేఖర్ రావునేర్పరి అని ఆయన అన్నారు. చంద్రశేఖర్రావు పద్ధతులు తమ పార్టీ మీదప్రయోగిస్తే తిప్పికొడతాయని ఆయనహెచ్చరించారు. పోలీసులు కూడా ప్రజాస్వామ్యస్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని ఆయనవ్యాఖ్యానించారు.