వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్‌యాభై శాతం: ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆసిఫ్‌నగర్‌ శాసనసభానియోజకవర్గంలో ఓటు వేయడానికి ప్రజలుపెద్దగా ఆసక్తి చూపలేదు. ఓట్ల పోలింగ్‌చాలా తక్కువగా నమోదైంది. ముప్పైయేడు శాతం మంది ఓటర్లు మాత్రమేతమ ఓటు హక్కునువినియోగించుకున్నారు. ఆసిఫ్‌నగర్‌,సిద్ధిపేట శాసనసభా నియోజవర్గాలకుబుధవారంనాడు పోలింగ్‌ జరిగింది.

ఆసిఫ్‌పగర్‌నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌ల వద్దఓటర్లు కొద్దిగా ఎక్కువ మందేకనిపించినప్పటికీ మధ్యాహ్నంతర్వాత ఓటింగ్‌ శాతం పూర్తిగాతగ్గింది. పరిస్థితి సిద్ధిపేటలో కాస్తామెరుగ్గా ఉంది. గుర్తింపు కార్డులుకచ్చితంగా చూపాలని పోలింగ్‌ అధికారులుపట్టుబట్టడం వల్ల ఓటింగ్‌ శాతం తగ్గినట్లుభావిస్తున్నారు. ఆసిఫ్‌నగర్‌నియోజకవర్గంలో ముగ్గురిపై కేసులునమోదు చేసినట్లు హైదరాబాద్‌పోలీసు కమీషనర్‌ ఆర్‌.పి. సింహ్‌చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి దానంనాగేందర్‌, మజ్లీస్‌ లోక్‌సభ సభ్యుడుఅసదుద్దీన్‌ ఓవైసీపై, మరొకరిపై కేసులునమోదు చేసినట్లు ఆయన తెలిపారు.ముందు జాగ్రత్త చర్యగా నలబైఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లుఆయన తెలిపారు.ఓటర్లనుమభ్యపెట్టడానికి డబ్బులు, మద్యంపంపిణీ చేశారని రాజకీయ పార్టీలుపరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గంలోతెలుగుదేశం పార్టీ డబ్బులు, మద్యంపంపిణీ చేసినట్లు తెలంగాణ రాష్ట్రసమితి ఆరోపించింది. సిద్ధిపేటలో టి ఆర్‌యస్‌డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లుతెలుగుదేశం అభ్యర్థి చెరుకుముత్యం రెడ్డి ఆరోపించారు. ఈఆరోపణలను టి ఆర్‌యస్‌ నాయకుడు ఎ.నరేంద్ర ఖండించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X