వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొద్ది మందికోసం పులిచింతల: జయశంకర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ అన్యాయానికి, కృష్ణా డెల్టాఅభివృద్ధికి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్నిచేపడుతున్నారని తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్‌యస్‌) సిద్ధాంతకర్త,కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టునిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణవిద్యావంతుల ఆధ్వర్యంలో శుక్రవారంహైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనిరసన ప్రదర్శన జరిగింది.

పులిచింతలనిర్మాణం కోసం ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఎందుకుఅంతగా ఉబలాటపడుతున్నారని ఆయనప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు,రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలుపులిచింతల ప్రాజెక్టునువ్యతిరేకిస్తున్నాయని, కృష్ణా డెల్టాలోనికొద్ది మంది సంపన్న వర్గాల ప్రయోజనాలకోసమే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికిపూనుకుంటున్నారని, ఈ కొద్ది మందిసంపన్న వర్గాలే ప్రభుత్వయంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయనిఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగానదీ జలాల పంపకం జరగాలని ఆయనడిమాండ్‌ చేశారు. పులిచింతలప్రాజెక్టును దిగువన నిర్మిస్తే తమకుఅభ్యంతరం లేదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X