వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరివైనాఅభివృద్ధి మాటలే వింటాం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు:నక్సల్స్‌ మాటలే కాదు, అభివృద్ధికితోడ్పడే మాటలు ఎవరు చెప్పినా వింటామనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. పులిచింతలప్రాజెక్టుకు ఆయన శుక్రవారంకృష్ణానదికి కుడిపైపున పులిచింతల,మాదిపాడు గ్రామాల మధ్యశంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలోమాట్లాడిన అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాతహెలికాప్టర్‌లో నల్లగొండ జిల్లాకుబయలుదేరి వెళ్లారు.

అభివృద్ధినిఅడ్డగించే మాట ఎవరు చెప్పినా వినబోమనిఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టునుతెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)అడ్డగించదని, టి ఆర్‌యస్‌కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు కూడాధరించరని ఆయన చెప్పారు. తాముచేసే మంచి పనులను బలపరచాలని ఆయనతెలుగుదేశం పార్టీని కోరారు. టిఆర్‌యస్‌ అర్థం చేసుకోవాలనిసహకరించాలని ఆయన అన్నారు.ముంపుగ్రామాల నిర్వాసితులకు నెలల లోపలనష్టపరిహారం చెల్లిస్తామని, వారికిప్రత్యామ్నాయం చూపుతామని, ఆగ్రామాలను ఆదర్శ గ్రామాలుగాతీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.పులిచింతల ప్రాజెక్టును ముప్పై నెలలకన్నా ముందే పూర్తి చేస్తామని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X