వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిప్రభుత్వంలో బియ్యం గల్లంతు:రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:గత తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థికఅవకతవకలకు పాల్పడిందని ఆర్థికమంత్రి కె. రోశయ్య చెప్పారు. పనికిఆహారం బియ్యాన్ని దారి మళ్లించిందని ఆయనసోమవారం విలేకరుల సమావేశంలోఆరోపించారు. ఇటువంటి ఫ్రాడ్‌ ఎవరైనావ్యక్తులు చేసి వుంటే జైలు కటకటాలులెక్కించాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఇదిఆర్థిక నేరం కిందికే వస్తుందనిఆయన అన్నారు.

పనికిఆహారం పథకం కింద కేంద్రం నుంచివచ్చిన బియ్యానికి గత తెలుగుదేశంప్రభుత్వం మార్కెట్‌ సెస్సు, రవాణాచార్జీలు చెల్లించలేదని ఆయన చెప్పారు.పైగా ఆ బియ్యాన్ని ప్రభుత్వ పంపిణీవ్యవస్థకు తరలించిందని ఆయనఅన్నారు. దీని వల్ల రెండు లక్షల టన్నులబియ్యానికి లెక్కలు లేకుండా పోయాయనిఆయన చెప్పారు. గత తెలుగుదేశంప్రభుత్వం అవకతవకల వల్లతమ ప్రభుత్వం రెండు వందలఅరవై కోట్ల రూపాయలు చెల్లించాల్సివస్తోందని ఆయన అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకంవల్ల తాము పనికి ఆహారం పథకంకింద బియ్యం పొందడానికి వినియోగసర్టిఫికెట్‌ సమర్పించలేని స్థితిఏర్పడిందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X