వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీరప్పన్మృతిపై కన్నడ రాజ్కుమార్హర్షం
బెంగుళూరు:గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలోకిడ్నాప్నకు గురై, నూట తొమ్మిది రోజుల పాటుబందీగా ఉన్న నిన్నటి తరాల కన్నడ చలనచిత్రనటుడు రాజ్కుమార్ ఇప్పుడు హమ్మయ్యఅనుకుంటున్నారు. ఇప్పుడు తాను తన జన్మస్థలమైనదొడ్డగజనూర్కు నిర్భయంగావెళ్లవచ్చునని ఆయన మంగళవారంచెప్పారు.
దొడ్డగజనూర్ వద్దనే వీరప్పన్ నాలుగేళ్ళక్రితం రాజ్కుమార్ను కిడ్నాప్ చేశారు.వీరప్పన్ మృతి తనకు ఎలాంటి ఆసక్తినికలిగించలేదని ఆయన అన్నారు. వీరప్పన్మృతి వార్త వెలువడిన వెంటనే రాజ్కుమార్కుటుంబంతో కలిసి తన స్వగహంలోవిలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.వీరప్పన్ను ఒక క్రూరమృగంగాను,దుష్ట క్రిమిగాను ఆయన పేర్కొన్నారు.ఇంతకాలం రాష్ట్రాన్ని, దేశాన్ని పీడించినదరిద్రం వదిలి పోయింది అని ఆయనవీరప్పన్ మృతిపై ప్రతిస్పందించారు. రాజ్కుమార్చాలా ఆనందంగా కనిపించారు.
Comments
Story first published: Tuesday, October 19, 2004, 23:53 [IST]