వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్ళీ మామూలుపోలీసులం: డిజిపి
హైదరాబాద్:చర్చలకు వచ్చిన నక్సలైట్లు అడవుల్లోకి తిరిగి వెళ్ళిపోయినందువల్లతాము మామూలుగా పోలీసు విధులు నిర్వహిస్తామని రాష్ట్రపోలీసుడైరెక్టర్ జనరల్ సుకుమార చెప్పారు.కోర్టులు, ప్రభుత్వాలు ఆదేశించినవిధంగా తాము నడుచుకుంటామని, చర్చలకు వచ్చిననక్సలైట్లకురక్షణ కల్పించామని, వారిని భద్రంగాఅడవుల్లోకి పంపామని ఆయన బుధవారం ఇక్కడ విలేకరులసమావేశంలో అన్నారు.
ఇకమామూలుగానే నక్సలైట్ల కదలికలనుపోలీసులు గమనిస్తూ ఉంటారనిఆయన అన్నారు. చర్చల కారణంగా పోలీసులకునక్సలైట్లకు మధ్యసుహృద్భావ వాతావరణంఏర్పడిందని సుకుమారఅభిప్రాయపడ్డారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయనఅడవుల్లో ఉండే నక్సలైట్లకు ప్రపంచబ్యాంకు గురించిఏమితెలుసని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Story first published: Wednesday, October 20, 2004, 23:53 [IST]