నా పిల్లలకు చదువు చెప్పించండి: వీరప్పన్భార్య
మెట్టూర్:అందరూ అనుకుంటున్నట్టు వీరప్పన్ కోట్లరూపాయలు సంపాదించలేదని, అదే నిజమైతే తాను, తనకుమార్తెలుఇంతటి దీన స్ధితిలో ఎందుకుంటామనివీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వాపోయింది. వీరప్పన్భార్యనైనందుకుతన జీవితం, తన పిల్లలు జీవితం నాశనమైందని,ప్రభుత్వ సాయం ఏమీ అక్కర్లేదని,పిల్లలకు తగిన విద్యను చెప్పించాలని బందిపోటువీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ప్రభుత్వాన్నికోరింది.
సోమవారం రాత్రి ఎస్టి ఎఫ్ చేతిలోహతమైన వీరప్పన్కు తమిళనాడులోనిమెట్టూరుకు సమీపంలో మూలక్కాడు వద్ద అంత్యక్రియలు ముగిసినతరువాత ముత్తులక్ష్మి మాట్లాడుతూరాష్ట్రప్రభుత్వం తన ఇద్దరు పిల్లలకుచదువు చెప్పించడంలో సహాయం చేయాలనికోరారు. దాదాపు పది సంవత్సరాల పాటుఎస్టి ఎఫ్ నియంత్రణలో ఉన్న ముత్తులక్ష్మికిఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించలేదు.ఎస్టి ఎఫ్ కానీ, అటు ప్రభుత్వం కాని ఎవరోఒకరుతన ఇద్దరు పిల్లలకు విద్యాబుద్దులు చెప్పించడానికిసహాయం చేయాలని ఆమె కోరారు.