మంత్రివర్గంతోచర్చించాకే రెండోవిడత:సిఎం
హైదరాబాద్:నక్సలైట్లతో తొలివిడత చర్చలవివరాలను మం మంత్రివర్గ సమావేశంలోచర్చించనున్నట్టుముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్రాజశేఖరరెడ్డి చెప్పారు. నక్సలైట్లతో రెండోవిడతచర్చలు జరపాలా, వద్దా, జరిపితే ఎప్పుడు జరపాలిఅన్న విషయాలను కూడా మంత్రి వర్గసమావేశంలో చర్చిస్తామని గురువారంఆయన గాంధీభవన్లో జరిగిన ఒకకార్యక్రమంలో తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గసమావేశం ఈనెల ముప్పైన జరగవచ్చు.
కాంగ్రెస్పార్టీ సభ్యుల ప్రవర్తన నియమావళితెలుగు అనువాదాన్ని విడుదల చేసినఆయన టిఆర్ఎస్ గురించి కూడాప్రస్తావించారు. టిఆర్ఎస్ ఇప్పటికీ తమమిత్రపక్షమని, ఆ పార్టీ నుంచి వచ్చేవారినికాంగ్రెస్లో చేర్చుకున్నంత మాత్రానస్నేహం దెబ్బ తినబోదని ఆయన వ్యాఖ్యానించారు. నక్సలైట్లపై డిజిపిసుకుమార చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రిసమర్ధించారు. నక్సలైట్లు ఆయుధాలు విడనాడి జనజీవనస్రవంతిలోకి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.