వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జార్ఖండ్లో రైల్వే స్టేషన్ పేల్చిన నక్సల్స్
మేదినీనగర్: జార్ఖండ్ రాష్ట్రం లాతెహర్ జిల్లా రైల్వేస్టేషన్ను నిషిద్ధ పీపుల్స్ వార్ దళం నక్సలైట్లు గురువారం ఉదయం డైనమైట్లతో పేల్చివేశారు.
దాదాపు వంద మంది నక్సలైట్లు స్టేషన్ను చుట్టుముట్టి డ్యూటీలో ఉన్న సిబ్బంది, రైళ్ళ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల్ని స్టేషన్ నుంచి ఖాళీ చేయించి డైనమెట్ల సాయంతో పేల్చివేశారని పోలీసు సూపరింటెండెంట్తెలిపారు. ఈ సంఘటనలో ఎవ్వరూ గాయపడలేదని రైళ్ళ పట్టాలు దెబ్బ తినలేదని ఆయన చెప్పారు. కాగా తూర్పు రైల్వే పరిధిలోని ధన్బాద్ డివిజన్ వద్ద రైళ్ళరాకపోకలు నిలిచిపోయాయి.
Story first published: Thursday, October 21, 2004, 23:53 [IST]