వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహా సిఎం ఆలస్యానికి లెఫ్టే కారణం:షిండే
ముంబాయి: ముఖ్యమంత్రి విషయంలో ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న సందిగ్ధానికి సిపిఎం ప్రధాన కారణమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవడానికి సిపిఎం తిరస్కరించడమే దీనికి కారణమని ఆయన అన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఎన్సిపి అతిపెద్ద పార్టీగా మారిందని ఆయన అన్నారు.
కాగా బుధవారం నాడు న్యూఢిల్లీ నుంచి ఇక్కడకు చేరుకున్న షిండే నేరుగా రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ మహ్మద్ ఫాజల్, షిండే రాజీనామాను అంగీకరించి తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలిని ఆయనను కోరారు.
Comments
Story first published: Thursday, October 21, 2004, 23:53 [IST]