వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫ్యాక్షనిజం కంటేనక్సలిజమే డేంజర్:వైఎస్
హైదరాబాద్:ఫ్యాక్షనిజం కంటే నక్సలిజం ప్రమాదకరమైనదనిముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు.గురువారం పోలీసు అమరవీరులసంస్మరణ సభలో ప్రసంగించిన ఆయన నక్సలైట్లుఆయుధాలు విడనాడాల్సిందేననిమరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు భద్రతకల్పించేందుకు ఆయుధాలు పోలీసుల వద్ద ఉండాలే కానీ విప్లవకారులచేతుల్లో ఉండరాదని ఆయన అన్నారు.
సమస్యలను సాకుగాచూపి పెత్తనం చెలాయించాలని చూస్తే సహించబోమనిముఖ్యమంత్రి హెచ్చరించారు. పల్లెసీమల్లో ప్రశాంత వాతావరణంఏర్పాటుకు కృషి చేయవలసిందిగా ఆయనపోలీసు సిబ్బందికి సూచించారు. హోంమంత్రిజానారెడ్డి మాట్లాడుతూ పోలీసులు మానవహక్కులనుదృష్టిలో ఉంచుకునిశాంతిభద్రతల విధులను నిర్వర్తించాలని,పేదల కన్నీళ్ళను, కష్టాలనుపట్టించుకోవాలని ఆయన సూచించారు.
Comments
Story first published: Thursday, October 21, 2004, 23:53 [IST]